
Hyderabad City Bus Passengers: హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. లాక్డౌన్ సమయంలో వినియోగించుకోలేని బస్ పాసులను తిరిగి ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించింది. నవంబర్ 30వ తేదీలోగా పాత ఐడీ కార్డు, టికెట్ను సంబంధిత కౌంటర్లలో సమర్పించి కొత్త పాస్లను తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ సూచించింది.
కరోనా కారణంగా మార్చి నుంచి సెప్టెంబర్ వరకు బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బస్ పాసులు తీసుకున్నవారు వినియోగించుకోలేకపోయారు. కాబట్టి వారికీ ఇప్పుడు కొత్త పాస్లను జారీ చేయాలని యోచిస్తోంది. నగరంలో దాదాపుగా 20 లక్షల మంది సిటీ బస్ పాసులు కలిగి ఉన్నారు.
Also Read:
NASA: ఆ ఒక్క ఆస్టరాయిడ్తో.. భూమి మీద అందరూ కోటీశ్వరులే..!