తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగి 36 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. పాపికొండలను చూసేందుకు పర్యాటకులు లాంచీలో వెళ్తుండగా ఈ పెను విషాదం చోటుచేసుకుంది. దీంతో.. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా.. నేడు ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక రెస్య్యూ బృందాలు.. కచ్చులూరికి రానున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యి.. యుద్ధ ప్రాతిపదికన గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు. అలాగే.. హెలికాఫ్టర్, ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేస్తున్నారు. భాదితులకు 10 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు సీఎం జగన్.
కాగా.. ఈ ప్రమాదంలో.. 25 మంది పర్యాటకులు సేఫ్ అయ్యారు వారి పేర్లు:
1. గొర్రె ప్రభాకర్, ఖాజీ పేట
2. పూసల లక్ష్మీ, అనఖాపల్లి
3. సీహెచ్ జానకి రామారావు, ఉప్పల్, హైదరాబాద్
4. దుర్గం మధులత, తిరుపతి
5. కట్టిపోగు గాంధీ, విజయవాడ
6. ఆరపల్లి యాదగిరి, ఖాజీపేట, వరంగల్
7. బీ దసరయ్య, వరంగల్
8. బీ సురేష్, వరంగల్
9. భాస్క వెంకట స్వామి
10. ఎస్ రాజేష్, హైదరాబాద్
11. ఎమ్ కిరణ్ కుమార్, హైదరాబాద్
12. ఎన్ సురేష్, హైదరాబాద్
13. జెర్మనీ కుమార్, హైదరాబాద్
14. కే అర్జున్, హైదరాబాద్
15. ముజురుద్దీన్, హైదరాబాద్
16. మనడల్ గంగాధర్, నర్సాపురం
17. గొర్రిపర్తి సుబ్రమణ్యం, హునుమాన్ జంక్షన్
18. ఉంగరాల శ్రీను, హనుమాన్ జంక్షన్
19. మద్దెల జాజుబాబు, హనుమాన్ జంక్షన్
20. కంచెం జగన్నాథ రెడ్డి, కడప
21. వేడుల్ల నాగు, బోట్ వర్కర్, దేవీపట్నం
22. వీ కృష్ణ కుమార్ రెడ్డి, బోట్ వర్కర్, కొల్లూర్ విలేజ్
23. శివ, బోట్ డ్యాన్సర్
24. రోహిత్ బోట్ డ్యాన్సర్
25. నాగు, బోట్ డ్యాన్సర్