బెంగాల్ తరువాత అస్సాం పై బీజేపీ ఫోకస్, పార్టీలో చేరేందుకు మాజీ మంత్రి అజంతా నియోగ్ రెడీ ! అమిత్ షాతో భేటీ

పశ్చిమ బెంగాల్ తరువాత బీజేపీ అస్సాం పై దృష్టి పెట్టింది. రెండు రోజుల పర్యటనకు గాను హోం మంత్రి అమిత్ షా శుక్రవారమే ఈ రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అజంతా నియోగ్ శనివారం ఆయనతో..

బెంగాల్ తరువాత అస్సాం పై బీజేపీ ఫోకస్, పార్టీలో చేరేందుకు మాజీ మంత్రి అజంతా నియోగ్ రెడీ ! అమిత్ షాతో భేటీ

Edited By:

Updated on: Dec 27, 2020 | 10:05 AM

Former Minister Ajanta Neog: పశ్చిమ బెంగాల్ తరువాత బీజేపీ అస్సాం పై దృష్టి పెట్టింది. రెండు రోజుల పర్యటనకు గాను హోం మంత్రి అమిత్ షా శుక్రవారమే ఈ రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అజంతా నియోగ్ శనివారం ఆయనతో సమావేశమయ్యారు. గోలాఘాట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఈమె..రెండు రోజుల్లో బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు, లోగడ ఈమె కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం ఉన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీలో ఉన్నప్పటికీ తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేకపోయానని ఆమె తెలిపారు. ఏమైనా ఇక కాంగ్రెస్ ను వీడినట్టు వెల్లడించారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై కాంగ్రెస్ ఈమెను ఇటీవల ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది.

ఈనెలారంభంలో అజంతా నియోగ్ సీఎం సర్బానంద సోనోవాల్. నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయెన్స్ కన్వీనర్ హిమంత బిస్వాస్ శర్మ తో భేటీ అయ్యారు. కాగా వచ్ఛే ఏడాది అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో అసోం గణ పరిషద్ బీజేపీ మిత్ర పక్షంగా  ఉంది.

Read More:

లేడీకిలాడీని పట్టించిన స్టేటస్, అభిరుచులు పంచుకోడానికే కాదు, ఇప్పుడు ఇలానూ పనిచేస్తోన్న వాట్సాప్ స్టేటస్.!

కృష్ణా జిల్లాలో మిస్టరీగా మారిన వృద్ధ దంపతుల హత్య కేసు.. ఆధారాల సేకరణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు..

తెగని తగవు: నా వంతు అంటూ అమర్ నాథ్ ఎంట్రీ, సాయినాథుని సాక్షిగా సాగరనగరంలో కొనసాగుతోన్న వెలగపూడి వర్సెస్ వైసీపీ

Loading...
Unable to load recommendations.
Follow Us