మంత్రులకు మోదీ తొలి దిశా నిర్దేశం
కొత్త కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ తొలి కేబినెట్ సమావేశానికి సిద్ధమయ్యారు. బుధవారం కేంద్ర మంత్రులతో, మోదీ భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ కార్యాచరణపై ఆయన వారికి వివరించనున్నారు. అలాగే కొత్తగా ఎన్నికైన మంత్రులు వారి వారి రాష్ట్రాలపై పెట్టాల్సిన దృష్టి, బాధ్యతలు.. ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి ప్రజల్లో అవగాహన తదితర అంశాలపై వారితో చర్చించనున్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనుండగా.. వాటిపై మంత్రులకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. […]
కొత్త కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ తొలి కేబినెట్ సమావేశానికి సిద్ధమయ్యారు. బుధవారం కేంద్ర మంత్రులతో, మోదీ భేటీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ కార్యాచరణపై ఆయన వారికి వివరించనున్నారు. అలాగే కొత్తగా ఎన్నికైన మంత్రులు వారి వారి రాష్ట్రాలపై పెట్టాల్సిన దృష్టి, బాధ్యతలు.. ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి ప్రజల్లో అవగాహన తదితర అంశాలపై వారితో చర్చించనున్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనుండగా.. వాటిపై మంత్రులకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు పీఎం- కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 6వేలు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలన్న ప్రధాని మోదీ హామీకి ఈ కేబినెట్ భేటీలో ఆమోదం లభించనుంది.