విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఫొటోల రగడ

| Edited By:

Jun 22, 2019 | 4:18 PM

బెజవాడ కార్పొరేషన్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కార్పొరేషన్‌లో ముఖ్యమంత్రుల ఫొటోల విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. తనను అడక్కుండా హాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలను తొలగించి, జగన్ ఫొటోలను ఎలా పెడతారంటూ మేయర్ శ్రీధర్, కార్పొరేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ హాల్లో చంద్రబాబు ఫొటో తీసినా పరవాలేదు కానీ.. ఎన్టీఆర్ ఫొటోను ఎందుకు తీశారని మేయర్ శ్రీధర్ అధికారులపై మండిపడ్డారు. అయితే దీనిపై […]

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఫొటోల రగడ
Follow us on

బెజవాడ కార్పొరేషన్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కార్పొరేషన్‌లో ముఖ్యమంత్రుల ఫొటోల విషయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. తనను అడక్కుండా హాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలను తొలగించి, జగన్ ఫొటోలను ఎలా పెడతారంటూ మేయర్ శ్రీధర్, కార్పొరేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేషన్ హాల్లో చంద్రబాబు ఫొటో తీసినా పరవాలేదు కానీ.. ఎన్టీఆర్ ఫొటోను ఎందుకు తీశారని మేయర్ శ్రీధర్ అధికారులపై మండిపడ్డారు. అయితే దీనిపై అక్కడే ఉన్న వైసీపీ కార్పొరేటర్లు కలగచేసుకుని, ఎన్టీఆర్ ఫొటోతో పాటు వైఎస్ రాజశేఖర్ ఫొటోను పెట్టాలని, చనిపోయిన ముఖ్యమంత్రుల ఫొటోలను కౌన్సిల్ హాల్లో పెట్డం సాంప్రదాయమని వైసీపీ సభ్యులు అన్నారు. అయితే.. రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టడానికి వీల్లేదని మేయర్ శ్రీధర్ స్పష్టం చేశారు.