నదుల్లో కలిసే కలుషిత నీరు శుద్ధిచేసేందుకు ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నదుల్లో కలుస్తున్న కలుషిత నీటి శుద్ధి కోసం వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్​లను ఏర్పాటు చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

నదుల్లో కలిసే కలుషిత నీరు శుద్ధిచేసేందుకు ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

Updated on: Aug 05, 2020 | 7:17 PM

Jagan Government : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నదుల్లో కలుస్తున్న కలుషిత నీటి శుద్ధి కోసం వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్​లను ఏర్పాటు చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటుకు నోడల్ ఆఫిస‌ర్‌గా పురపాలక శాఖ కార్యదర్శిని నియమిస్తూ గ‌వ‌ర్న‌మెంట్ ఉత్తర్వులు వెలువ‌రించింది. విజయవాడ, రాజమహేంద్రవరం, తాడేపల్లి, శ్రీకాకుళం, నంద్యాలలోని ఐదు నదులలో కలుషిత నీరు క‌లుస్తుంద‌ని గతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలో వెల్ల‌డించింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 100 శాతం కలుషిత నీటిని క్లీన్ చేసే చర్యలు తీసుకోవాలని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ నిర్మాణాలు కంప్లీట్ చేసేందుకు వెంట‌నే చర్యలు చేపట్టాలని ఏపీ స‌ర్కార్ నిర్ణయించింది.

 

Also Read : సుశాంత్ మరణంపై సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్

Loading...
Unable to load recommendations.
Follow Us