కనిగిరి వద్ద బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం!

ఓ ప్రయివేట్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపాలెం దగ్గర ప్రయివేట్ బస్సులో మంటలు చెలరేగాయి. కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే ప్రయణికులు దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కనిగిరి నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ […]

కనిగిరి వద్ద బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం!
Follow us

| Edited By:

Updated on: Nov 27, 2019 | 5:37 AM

ఓ ప్రయివేట్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపాలెం దగ్గర ప్రయివేట్ బస్సులో మంటలు చెలరేగాయి. కావేరి ట్రావెల్స్ కు చెందిన బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే ప్రయణికులు దిగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కనిగిరి నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంక్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Latest Articles