EPFO Good News: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్వో) మీకో గుడ్ న్యూస్ అందించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీని దీపావళి నాటికి ఖాతాదారుల అకౌంట్లలోకి జమ చేయనుంది. ఇప్పటికే ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీని ఇవ్వనున్నట్లు ఈపీఎఫ్వో ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటిగా ఈ వడ్డీని రెండు విడతల్లో చెల్లిస్తామని చెప్పిన ఈపీఎఫ్వో.. ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని ఒకే విడతలో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనితో సుమారు 6 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ ఖాతాదారులు లబ్ది పొందనున్నారు.
Also Read: రోహిత్.! టీమిండియా కంటే ఐపీఎల్ ముఖ్యమా.?