చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మూడుసార్లు భూమి కంపించింది. రామసముద్రం మండలం కాప్పలి, బైరాజుపల్లిలో ఈరాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు తీశారు. ప్రకంపనలకు – ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పాడ్డాయి. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.
తాజాగా, నివర్ తుఫాన్ కారణంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో నీరు భూమి లోపలి పొరలకు ఇంకి ఉంటుందనే ఈ కారణంతోనే భూ ప్రకంపనలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు.