ధోనికి ఇదే ఆఖరి సీజనా.? జెర్సీలిస్తున్నాడేంటీ.!

|

Oct 25, 2020 | 12:14 PM

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకోనున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం తన జెర్సీని జోస్ బట్లర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు.

ధోనికి ఇదే ఆఖరి సీజనా.? జెర్సీలిస్తున్నాడేంటీ.!
Follow us on

Dhoni May Quit IPL Soon: మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకోనున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం తన జెర్సీని జోస్ బట్లర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. అలాగే ముంబైతో మ్యాచ్ అనంతరం పాండ్యా బ్రదర్స్‌కు కూడా తన ఏడో నెంబర్ జెర్సీని బహుకరించాడు. అంతేకాదు ఈ సీజన్‌లో పలువురు క్రికెటర్లు ధోని ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం చూస్తుంటే.. సీఎస్‌కే సారధికి ఇదే చివరి సీజన్ కావొచ్చునని ఫ్యాన్స్‌లో అనుమానాలు కలుగుతున్నాయి.

ఇందుకు మరో కారణం కూడా లేకపోలేదు. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఏడాది సీజన్‌లో చెన్నై అత్యంత పేలవ ఆటతీరును కనబరుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఘోర వైఫల్యాలను ఎదుర్కుంది. ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించి కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత పొందలేక టోర్నీ నుంచి నిస్క్రమించింది. దీనితో తోడు ధోని ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని త్వరలోనే లీగ్ నుంచి తప్పుకుంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో చెన్నై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.