కరోనా కాలంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

|

Jul 31, 2020 | 12:17 PM

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి కొంతమంది అయితే సరైన ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

కరోనా కాలంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Follow us on

Delhi Government Job Portal: కరోనా వైరస్ సంక్షోభం కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి కొంతమంది అయితే సరైన ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో నిరుద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారందరికీ ఉపాధి కల్పించే దిశగా నూతన జాబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈ పోర్టల్‌కు విశేష స్పందన రావడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ హర్షం వ్యక్తం చేశారు.

సుమారు 2 లక్షల ఉద్యోగాలకు.. 3 లక్షల 22 వేల మంది నిరుద్యోగులు అప్లై చేసుకున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే జాబ్ పోర్టల్‌లో దాదాపు 7,577 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని.. నిరుద్యోగులు వారి పేర్లను నమోదు చేసుకునేందుకు ఎటువంటి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

గవర్నమెంట్ జాబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోండిలా..

  • మొదటిగా సైట్‌లో లాగిన్ కావాలి.
  • ఆ తర్వాత మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి.
  • మీకు నచ్చిన విభాగంలోని ఉద్యోగానికి నమోదు చేసుకోవాలి.
  • ఒక వ్యక్తి ఒక ఉద్యోగానికి మాత్రమే అప్లై చేసుకోగలడు.
  • చివరిగా నియామకానికి సంబంధించిన సమాధానాన్ని పోర్టల్ అధికారులు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తారు.

Also Read:

మహిళల కోసం మరో రెండు పధకాలు.. జగన్ సర్కార్ సంచలనం

హైదరాబాద్‌లో కరోనా పరీక్షల కేంద్రాల వివరాలివే.!

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగష్టు 15 నుంచి వీడియో పాఠాలు!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్.!