కరోనా కట్టడిలో ఢిల్లీ భేష్ : 90శాతం దాటిన రికవరీ రేటు
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చెయ్యడంలో ఢిల్లీ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అక్కడ రికవరీ రేటు 90.5 శాతానికి పెరిగింది. కొత్త కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గింది.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చెయ్యడంలో ఢిల్లీ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అక్కడ రికవరీ రేటు 90.5 శాతానికి పెరిగింది. కొత్త కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. జులై 27 తర్వాత అత్యల్పంగా ఆదివారం 652మందికి మాత్రమే వైరస్ సోకింది. వారంలో రెండో సారి 10 కంటే తక్కువ మంది చనిపోయారు. 24 గంటల్లోనే 1,310మంది వ్యాధి నుంచి రికవర్ అయ్యారు. జులై 27 తర్వాత ఒక్కరోజులో అత్యధిక మంది కోలుకోవడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,52,580కి చేరగా.. మరణాల సంఖ్య 4,196కి పెరిగింది. ప్రజంట్ అక్కడ 10,823 యాక్టివ్ కేసులున్నాయి.
కరోనా పరిస్థితిని అదుపులోనే ఉంచేందుకు గవర్నమెంట్ పటిష్ఠ చర్యలు చేపట్టింది. మతపరమైన వెేడుకలు బ్యాన్ చేసింది. మొహర్రం, గణేష్ చతుర్థి ఇళ్లలోనే సెలబ్రేట్ చేసుకోవాలని సూచించింది. ఓపెన్ ప్లేసుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించింది.ఈ మేరకు అన్ని జిల్లాలలో మత పెద్దలతో చర్చలు జరిపి..వారికి పరిస్థితిని వివరించారు అధికారులు.
Also Read :
పబ్జీ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని బ్లేడ్తో గొంతు కోసుకున్నాడు