దోపిడీ కేసులో దావూద్ సోదరుడి కుమారుడు అరెస్ట్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ కుమారుడు రిజ్వాన్ను యాంటీ ఎక్ట్సోర్షన్ విభాగం అరెస్ట్ చేసింది. రిజ్వాన్ దేశం విడిచి పారిపోతుండగా ముంబై విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే దావూద్ ముఠాకు చెందిన అహ్మద్ రజ వధారియాను దుబాయ్లో అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే రిజ్వాన్ను అరెస్ట్ చేయడం గమనర్హం. రజాతో రిజ్వాన్కు సంబంధాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. అయితే 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో […]
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ కుమారుడు రిజ్వాన్ను యాంటీ ఎక్ట్సోర్షన్ విభాగం అరెస్ట్ చేసింది. రిజ్వాన్ దేశం విడిచి పారిపోతుండగా ముంబై విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే దావూద్ ముఠాకు చెందిన అహ్మద్ రజ వధారియాను దుబాయ్లో అరెస్ట్ చేసిన కొద్ది రోజులకే రిజ్వాన్ను అరెస్ట్ చేయడం గమనర్హం. రజాతో రిజ్వాన్కు సంబంధాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
అయితే 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో భారత్ వేటాడుతున్న దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. ఆ తరువాత అతడు అక్కడే ఉన్నాడని పలు దేశాలు ఆధారాలను చూపించినా.. పాక్ మాత్రం ఆ వార్తలను మాత్రం ఖండిస్తూ వస్తోంది. మరోవైపు దావూద్ను పాకిస్తాన్ సత్వరమే భారత్కు అప్పగించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఇటీవల ఆ దేశాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.