ఢిల్లీలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కేసులు

| Edited By: Balu

Nov 09, 2020 | 11:14 AM

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 7,745 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇవి 4,38,529 కి పెరిగాయి. ఈ నెల 8 న 77 మంది కరోనా రోగులు మృతి చెందారని, 6,069 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివ్ రేటు 15 శాతానికి పెరిగినట్టు తెలిపింది. అటు దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకాలను, కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించింది. వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్నందున ఈ చర్య తీసుకుంటున్నట్టు పేర్కొంది.   […]

ఢిల్లీలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా వైరస్ కేసులు
Follow us on

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 7,745 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇవి 4,38,529 కి పెరిగాయి. ఈ నెల 8 న 77 మంది కరోనా రోగులు మృతి చెందారని, 6,069 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివ్ రేటు 15 శాతానికి పెరిగినట్టు తెలిపింది. అటు దీపావళి సందర్భంగా బాణాసంచా అమ్మకాలను, కాల్చడాన్ని ప్రభుత్వం నిషేధించింది. వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్నందున ఈ చర్య తీసుకుంటున్నట్టు పేర్కొంది.