రెండు రోజులపాటు కరోనా డెడ్ బాడీతో సావాసం

|

Jul 02, 2020 | 3:27 PM

అధికారుల్లో నిర్లక్ష్యానికి కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఓ కుటుంబం నానావస్థలు పడింది. మృతదేహాన్ని ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో పెట్టిన జాగారం చేశారు చివరికి రెండు రోజుల పాటు అధికారులు చుట్టూ తిరిగితే గానీ కనికరించలేదు. ఆ కుటుంబసభ్యులు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

రెండు రోజులపాటు కరోనా డెడ్ బాడీతో సావాసం
Follow us on

కరోనా మహ్మమారి ధాటి వేలాది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అధికారుల్లో నిర్లక్ష్యానికి కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఓ కుటుంబం నానావస్థలు పడింది. మృతదేహాన్ని ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో పెట్టిన జాగారం చేశారు ఆ కుటుంబసభ్యులు. చివరికి రెండు రోజుల పాటు అధికారులు చుట్టూ తిరిగితే గానీ కనికరించలేదు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.

కోల్‌క‌తాకు చెందిన 71 ఏళ్ల వ్య‌క్తి శ్వాస సంబంధిత స‌మ‌స్య‌తో సోమవారం స్థానిక ఆసుప‌త్రికి వెళ్లాడు. అయితే క‌రోనా ప‌రీక్ష చేసుకున్న త‌ర్వాతే చికిత్స చేస్తామ‌ని ఆస్పత్రి సిబ్బంది తిప్పి పంపించివేశారు. దీంతో ఇంటికి తిరిగి చేరుకున్న కొద్ది గంట‌ల్లోనే అతడు మ‌ృతి చెందాడు. అనంత‌రం అత‌ని మృత‌దేహాన్ని కుటుంబసభ్యలు స్థానిక శ్మశానవాటికి తీసుకువెళ్ల‌గా డెత్ సర్టిఫికెట్ ఉంటేనే అంత్యక్రియ‌లు నిర్వ‌హిస్తామ‌ని తేల్చి చెప్పారు. డెత్ సర్టిఫికేట్ కోసం మున్సిపల్ అధికారులను ఆశ్రయించిన కుటుంబసభ్యలుకు నిరాశ ఎదురైంది. అటు, అత‌నికి కోవిడ్ ఉందా? లేదా? అనే విష‌యం తెలిసేంత‌వ‌ర‌కు మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇవ్వ‌లేమ‌ని వైద్యులు తిర‌స్క‌రించారు. ఎలాగైనా ద‌హ‌న సంస్కారాలు జ‌రిపించ‌డంటూ అత‌ని కుటుంబ స‌భ్యులు స్థానిక మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకపోయింది. మ‌రోవైపు, డెడ్ బాడీ దుర్వాసన వ‌స్తుండ‌టంతో మంగ‌ళ‌వారం ఉద‌యం అత‌ని కుటుంబ‌స‌భ్యులు ఐస్‌క్రీం ఫ్రీజ‌ర్ కొని మృత‌దేహాన్ని అందులో పెట్టి ఉంచారు. ఇక చివరికి మంగళవారం సాయంత్రం అత‌నికి క‌రోనా పాజిటివ్‌గా వైద్యులు తేల్చారు. ఈ విష‌యాన్ని మున్సిపల్ అధికారుల‌కు సమాచారమిచ్చిన క‌నీస స్పంద‌న క‌రువైంది. దీంతో ఆ రోజు కూడా శ‌వంతోనే వారు బిక్కుబిక్కుమంటూ జాగారం చేశారు. చివరికి, బుధ‌వారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు కోల్‌క‌తా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఉద్యోగులు నివాసానికి చేరుకుని మృత‌దేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. సుమారు 50 గంట‌ల పాటు ఆ కుటుంబం కరోనా సోకి డెడ్ బాడీతో సావాసం చేశారు. అంతక్రియలు పూర్తి అయిన తర్వాత తేరుకున్న మున్సిపల్ సిబ్బంది వారు ఉంటున్న భ‌వ‌నాన్ని శానిటైజ్ చేశారు.