ఉస్మానియా ఆస్పత్రి డైటీషియన్‌కి కరోనా పాజిటివ్..!

|

May 30, 2020 | 6:14 PM

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి డైటీషియన్‌కి కూడా కొవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో కరోనా కేసు నవెూదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో డైటీషియన్‌గా పనిచేస్తున్న ఆయన శుక్రవారం పెబ్బేరు వచ్చివెళ్లాడు. […]

ఉస్మానియా ఆస్పత్రి డైటీషియన్‌కి కరోనా పాజిటివ్..!
Follow us on

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తాజాగా వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి డైటీషియన్‌కి కూడా కొవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో కరోనా కేసు నవెూదైంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో డైటీషియన్‌గా పనిచేస్తున్న ఆయన శుక్రవారం పెబ్బేరు వచ్చివెళ్లాడు. దీంతో అతనికి సంబంధించిన మూడు కుటుంబాల్లోని 11 మందిని హోం క్వారంటైన్ కు పంపించారు.
అటు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని చౌదర్‌పల్లిలో 13 నెలల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆ చిన్నారికి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి తండ్రి ఇబ్రహింపట్నం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులకు లేకుండా చిన్నారికి కరోనా రావడంతో వైద్య సిబ్బంది కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ లో ఉంచారు.