AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Cases India: దేశంలో కొత్తగా 20,035 పాజిటివ్ కేసులు, 256 మరణాలు..తగ్గుతోన్న క్రియాశీల కేసుల సంఖ్య..

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 20,035 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య..

Corona Cases India: దేశంలో కొత్తగా 20,035 పాజిటివ్ కేసులు, 256 మరణాలు..తగ్గుతోన్న క్రియాశీల కేసుల సంఖ్య..
Ravi Kiran
|

Updated on: Jan 01, 2021 | 2:59 PM

Share

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 20,035 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,709 చేరుకుంది. ఇందులో 2,54,254 యాక్టివ్ కేసులు ఉండగా.. 98,83,461 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 256 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో.. దేశంలో ఇప్పటివరకు 1,48,994 కరోనా మరణాలు సంభవించాయి.

అటు గత కొద్దిరోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో బుధవారం 23,181 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.47 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 96.08 శాతానికి రికవరీ రేటు చేరిందంది.