తమిళనాడులో కరోనా విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు వందలు దాటి వేలల్లోకి చేరాయి. నియంత్రణ చర్యలు ఉపయోగ పడటం లేదు. ప్రభుత్వ పెద్ద ఎత్తున కరోనా కట్టడిపై ప్రచారం చేస్తున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. కరోనా ఆంక్షలను గాలి వదిలేస్తున్నారు. దీంతో కరోనా పాజిటివ్ కేసులతో మృతుల సంఖ్య కూడా డబుల్ డిజిట్లోకి మారిపోయింది.
తమిళనాడు రాష్ర్టంలో కేవలం మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్ర వరకు 5,584 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,80,524కు చేరుకుందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం సాయంత్రం తాజగా విడుదల చేస్తున్న హెల్త్బులెటిన్లో పేర్కొంది. ఇవాళ 78 మంది వ్యాధి బారిన పడి మృతి చెందగా ఇప్పటివరకు 8,090 మంది మరణించారు. తాజాగా 6,516 మంది రోగులు వ్యాధి నుంచి కోలుకోగా మొత్తం 4,23,231మంది రికవర్ అయ్యారు.
గతంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే కరోనా కేసులు అధికంగా వస్తుండేవి. అయితే ఈ కోవిడ్ పాజిటివ్ కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాయి. ఈ రోజు నమోదైన 5,584 కేసుల్లో 993 పాజిటివ్ కేసులు చెన్నై మహానగరంలో వచ్చాయి. చెన్నై నగరంలో ఇప్పటి వరకు 1,44, 595 మందికి కరోనా బాధితులు యాక్టివ్ ఉన్నారు.