సీడబ్ల్యూసీ భేటీ..ఓటమిపై చర్చ

|

May 25, 2019 | 12:16 PM

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కారణాలను విశ్లేషించుకునేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం భేటీ అయ్యింది. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌ నేతలు గలాం నబీ ఆజాద్‌, మల్లికార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు. మరోవైపు ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ తన పదవికి […]

సీడబ్ల్యూసీ భేటీ..ఓటమిపై చర్చ
Follow us on

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కారణాలను విశ్లేషించుకునేందుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం భేటీ అయ్యింది. ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్‌ నేతలు గలాం నబీ ఆజాద్‌, మల్లికార్జున్‌ ఖర్గే, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ తదితరులు హాజరయ్యారు.

మరోవైపు ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్‌ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై మరికాసేపట్లో స్పష్టత రానుంది.

తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో అయితే కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే యూపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ రాజీనామా చేశారు. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు.