ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ

|

Sep 10, 2020 | 6:15 AM

ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో మధ్యాహ్నం బేగంపేటలోని ప్రగతిభవన్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ భేటీ అవుతారు.

ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ భేటీ
Follow us on

ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో మధ్యాహ్నం బేగంపేటలోని ప్రగతిభవన్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ భేటీ అవుతారు. ఈనెల 14 నుంచి మొదలు కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలోలో ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో పార్లమెంట్ వేదికగా గళమెత్తాలని ఎంపీలకు సీఎం సూచించనున్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.