AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాకు మరోసారి కరోనా ముప్పు..? నిపుణుల హెచ్చరిక..!

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజోరోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే.. కరోనావైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలో

చైనాకు మరోసారి కరోనా ముప్పు..? నిపుణుల హెచ్చరిక..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 17, 2020 | 2:22 PM

Share

China to face another Coronavirus wave: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజోరోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే.. కరోనావైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ, గతకొన్ని రోజులుగా అక్కడ మళ్లీ కోవిద్-19 కేసులు బయటపడుతున్నాయి. ఈ సందర్భంలో కరోనా మహమ్మారి నుంచి చైనా ఇంకా బయటపడలేదని అక్కడి నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కాగా.. కోవిద్-19 మహమ్మారిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చైనీయుల్లో లేని కారణంగా చైనాకు ఈ వైరస్‌ ముప్పు మరోసారి పొంచివుందని తాజాగా చైనా ప్రభుత్వ సీనియర్‌ ఆరోగ్య సలహాదారుడు హెచ్చరించారు. గత కొన్ని వారాలుగా వుహాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా కేసులు బయటపడుతున్నాయి. తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా చైనీయులు కోవిద్-19 బారినపడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు చైనాలోని ప్రముఖ వైద్య నిపుణులు డా.జోంగ్‌ నాన్‌షాన్‌ వెల్లడించారు. విదేశాలతో పోలిస్తే ఈసారి ముప్పు మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు.

Also Read: తెలంగాణలో కొండెక్కిన చికెన్.. ‘కోత’కు రంగం సిద్ధం..