మావోలపైకి.. మహిళా కమెండోలు.. ఛత్తీస్ గఢ్‌లో సరికొత్త వ్యూహం

| Edited By:

May 13, 2019 | 1:57 PM

నక్సల్స్ ఏరివేతకు ఇక రంగంలోకి నారీ శక్తి దిగింది. 30మంది మగువలు అత్యంత కఠినమైన శిక్షణ పూర్తిచేసుకుని కీకారణ్యంలో కాలుమోపారు. వారి లక్ష్యం ఒక్కటే.. కనిపించే మావోలను హతమార్చడమే. దేశంలో తొలిసారిగా కేవలం అంతా మహిళలే ఉన్న యాంటీ నక్సల్ కమాండో యూనిట్ ప్రారంభమైంది. చత్తీస్ గఢ్ లో నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే దంతెవాడ, బస్తర్ రీజియన్లలో ఈ టీమ్ పని చేయనుంది. వీరికి ‘దంతేశ్వరి ఫైటర్స్’గా పేరు పెట్టారు. నక్సల్స్ పై పోరులో వీరు […]

మావోలపైకి.. మహిళా కమెండోలు.. ఛత్తీస్ గఢ్‌లో సరికొత్త వ్యూహం
Follow us on

నక్సల్స్ ఏరివేతకు ఇక రంగంలోకి నారీ శక్తి దిగింది. 30మంది మగువలు అత్యంత కఠినమైన శిక్షణ పూర్తిచేసుకుని కీకారణ్యంలో కాలుమోపారు. వారి లక్ష్యం ఒక్కటే.. కనిపించే మావోలను హతమార్చడమే. దేశంలో తొలిసారిగా కేవలం అంతా మహిళలే ఉన్న యాంటీ నక్సల్ కమాండో యూనిట్ ప్రారంభమైంది. చత్తీస్ గఢ్ లో నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే దంతెవాడ, బస్తర్ రీజియన్లలో ఈ టీమ్ పని చేయనుంది. వీరికి ‘దంతేశ్వరి ఫైటర్స్’గా పేరు పెట్టారు.

నక్సల్స్ పై పోరులో వీరు ముందుండి నిలుస్తారని, డిప్యూటీ ఎస్పీ దినేశ్వరీ నంద్ ఈ టీమ్ ను లీడ్ చేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. ఇక్కడున్న యాంటీ నక్సల్స్ టీమ్ లతో ‘దంతేశ్వరి ఫైటర్స్’ కలిసి పని చేస్తుందని, కీకారణ్యంలో పోరాడేందుకు అవసరమైన శిక్షణను వీరికిచ్చామని వెల్లడించారు. ‘దంతేశ్వరి ఫైటర్స్’లోని మహిళలకు ఈ ప్రాంతం గురించిన పూర్తి సమాచారం తెలుసునని, వీరందరినీ బస్టారియా బెటాలియన్ టీమ్ నుంచే ఎంపిక చేసుకున్నామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు.