సీఎం జగన్ కు బాబు లేఖాస్త్రం…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. టిడిపి తెచ్చిన జీవో నెంబర్ 3 ప్రయోజనాలు కాపాడాలని లేఖలో ఆయన కోరారు. షెడ్యూల్ ప్రాంతాలలో టీచర్ పోస్టులు గిరిజనులకే దక్కేలా చూడాలన్న బాబు... రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ది లోపం గిరిజనులకు శాపంగా మారిందని ఆరోపించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబు లేఖ రాశారు. టిడిపి తెచ్చిన జీవో నెంబర్ 3 ప్రయోజనాలు కాపాడాలని లేఖలో ఆయన కోరారు. షెడ్యూల్ ప్రాంతాలలో టీచర్ పోస్టులు గిరిజనులకే దక్కేలా చూడాలన్న బాబు… రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ది లోపం గిరిజనులకు శాపంగా మారిందని ఆరోపించారు. వైసిపి ఉదాసీనత వల్లే బీసిల సాధికారతకు విఘాతం కలుగుతుందని.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 34% నుంచి 24%కు కోత పడటమే అందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా మేల్కొని జీవో నెంబర్ 3 ప్రయోజనాలు కాపాడి గిరిజన సాధికారతకు దోహదపడాలని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు.
గిరిజనుల హక్కుల రక్షణలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచెయ్యడం లేదని ఆరోపించారు చంద్రబాబు.షెడ్యూల్ ఏరియాలో ఉపాధ్యాయ పోస్టులను స్థానిక గిరిజనులతోనే భర్తీ చేయాలని, అందులో కూడా 33% మహిళలకే ఇవ్వాలని టిడిపి ప్రభుత్వం 2000 సంవత్సంరలో జీవో తెచ్చిందని గుర్తు చేశారు. రెండు దశాబ్దాల పాటు సదరు జీవో అమల్లో ఉందని.. దానివల్ల ఎంతోమంది గిరిజన యువతకు ఉద్యోగాలు దక్కాయని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల గిరిజనులంతా ఉపాధ్యాయ ఉద్యోగాలను షెడ్యూల్ ఏరియాలో కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాల సాధికారతకు, అణగారిన వర్గాల హక్కులు కాపాడేందుకు గత ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నట్లు కనబడుతోన్నారు చంద్రబాబు.