“చిన్నవాడైనా జగన్కు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా”
టీడీపీ ఎమ్మెల్యేలను ప్రసంగించేందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ..ఆయన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను ప్రస్తావించారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధానికి తెలుగుదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజధాని అంశం కంటే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తనను తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు స్పీచ్లోని ముఖ్యాంశాలు : ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా సిద్దాంతం […]
టీడీపీ ఎమ్మెల్యేలను ప్రసంగించేందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ..ఆయన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను ప్రస్తావించారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధానికి తెలుగుదేశం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజధాని అంశం కంటే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తనను తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు స్పీచ్లోని ముఖ్యాంశాలు :
ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని మా సిద్దాంతం
అందరూ నన్ను వ్యక్తిగతంగా తిట్టడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
వారు మాట్లాడిన ప్రతి విషయం ప్రజలు గమనిస్తున్నారు
ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్లో ఎక్కడ మూడు రాజధానుల ప్రస్తావన లేదు
శివరామకృష్ణన్ కమిటీ కృష్ణ, గుంటూరు జిల్లాల్లో రాజధాని పెట్టొద్దని చెప్పలేదు
శివరామకృష్ణన్ కమిటీ రాజధానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పింది
శివరామకృష్ణన్ కమిటీ 46 శాతం అమరావతిపైనే మొగ్గు చూపింది
అమరావతిని వరద ముప్పు ప్రాంతంగా పరిగణించలేమని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది
అమరావతి రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు
బంగారు గుడ్డు పెట్టే బాతులా అమరావతి మారుతుంది
మోదీ, కేసీఆర్ అమరావతిపై ప్రశంసలు కురిపించారు
వైఎస్సార్ చేపట్టిన ప్రాజెక్టులే నేను పూర్తి చేశారు
అమరావతికి ఇప్పటికి 130 సంస్థలు వచ్చాయి
విశాఖ అంటే నాకు ఎంతో ప్రేమ
ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల వల్ల సంస్థలు, కంపెనీలు హైదరాబాద్ తరలిపోతున్నాయి
తక్కువ వడ్డీతో 2 వేలు కోట్లు అప్పు పుట్టింది అంటే అది అమరావతి బలం
హుద్హుద్ వచ్చినప్పుడు ఎవరెంత చేశారో విశాఖ వాసులకు తెలుసు
హుద్హుద్ వచ్చినప్పుడు జగన్ కనీసం విశాఖ వాసులను పరామర్శించలేదు
విశాఖపై నాకు ఎంత ప్రేమ ఉందో…హుద్హుద్ సహాయ కార్యక్రమాలే చెబుతాయి
వైసీపీ చెప్పేవన్నీ బోగస్ కబుర్లు
ప్రపంచంలోని 5 నగరాల్లో ఒకటిగా అమరావతి ఉండాలనుకున్నా
జగన్ పార్టీ వాళ్లకు భాష రాక, అజ్ఞానంతో మాట్లాడుతున్నారు