AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు ప్రాణాలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ రోడ్డుప్రమాదం ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ప్రకాశం జిల్లాలో హైవేపై వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఇద్దరు ప్రాణాలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం
Balaraju Goud
|

Updated on: Sep 01, 2020 | 1:35 PM

Share

ఆంధ్రప్రదేశ్ రోడ్డుప్రమాదం ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ప్రకాశం జిల్లాలో హైవేపై వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద నార్కట్ పల్లి హైవే‌పై మంగళవారం అర్థరాత్రి జరిగింది. వివరాల్లోకివెళితే.. హైవేపై వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

బాధితులు హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి వారి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.