పిల్లల్ని ఎత్తుకుపోతున్న క్యాబ్ డ్రైవర్.. పట్టుకున్న పేరెంట్స్

| Edited By: Pardhasaradhi Peri

Aug 02, 2019 | 2:53 PM

తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ క్యాబ్ డ్రైవర్ ..తన కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన ఘటన షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ కుటుంబం తమ ఇంటికి వెళ్లేందుకు రెండు క్యాబ్‌లను బుక్ చేసుకున్నారు. తమ ముగ్గురు పిల్లలను ఓ క్యాబ్‌లో ఎక్కించి, మరో క్యాబ్‌లో తల్లిదండ్రులు ఎక్కారు. అయితే పిల్లలున్న క్యాబ్ డ్రైవర్ వారితో సహా పారిపోయే ప్రయత్నం […]

పిల్లల్ని ఎత్తుకుపోతున్న క్యాబ్ డ్రైవర్.. పట్టుకున్న పేరెంట్స్
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ క్యాబ్ డ్రైవర్ ..తన కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన ఘటన షాక్‌కు గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ కుటుంబం తమ ఇంటికి వెళ్లేందుకు రెండు క్యాబ్‌లను బుక్ చేసుకున్నారు. తమ ముగ్గురు పిల్లలను ఓ క్యాబ్‌లో ఎక్కించి, మరో క్యాబ్‌లో తల్లిదండ్రులు ఎక్కారు. అయితే పిల్లలున్న క్యాబ్ డ్రైవర్ వారితో సహా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో వెనకనే వస్తున్న తల్లిదండ్రులు ఆ కారును వెంబడించారు. ఇది గమనించిన క్యాబ్ డ్రైవర్ పిల్లల్ని వదిలి పారిపోయాడు. అయితే అదే క్యాబ్‌లో ఉన్న అతడి స్నేహితుడిని తల్లిదండ్రులు పట్టుుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసుకున్న శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.