ఇవిగో టీడీపీ నేతల భూములు.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటన

| Edited By:

Jan 20, 2020 | 1:30 PM

టీడీపీ నేతలు రాజధానిలో 40 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం చేశారంటూ ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లంకదినకరణ్, పయ్యావుల,కంభంపాటి రామ్మోహనరావులకు భూములున్నాయని చెప్పారు. విక్రమసింహ పేరుమీద పయ్యావుల భూమి కొనుగోలు చేశారని వివరించారు. వేమూరి రవికుమార్ కుటుంబ సభ్యుల పేర్లపై పెద్ద ఎత్తున భూములున్నాయన్నారు. మాజీ మంత్రివర్యులు పరిటాల సునీత కుమారుడి పేరు మీద కూడా భూములున్నాయని తెలిపారు. రాజధాని ప్రకటనకు ముందే ఈ భూములు […]

ఇవిగో టీడీపీ నేతల భూములు.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటన
Follow us on

టీడీపీ నేతలు రాజధానిలో 40 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం చేశారంటూ ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లంకదినకరణ్, పయ్యావుల,కంభంపాటి రామ్మోహనరావులకు భూములున్నాయని చెప్పారు. విక్రమసింహ పేరుమీద పయ్యావుల భూమి కొనుగోలు చేశారని వివరించారు. వేమూరి రవికుమార్ కుటుంబ సభ్యుల పేర్లపై పెద్ద ఎత్తున భూములున్నాయన్నారు. మాజీ మంత్రివర్యులు పరిటాల సునీత కుమారుడి పేరు మీద కూడా భూములున్నాయని తెలిపారు.

రాజధాని ప్రకటనకు ముందే ఈ భూములు కొన్నారని.. అసలు రాజధాని ప్రకటనకు ముందే ఆ ప్రాంతంలో వీరంతా భూములు ఎందుకు కొన్నారని.. అక్కడ రాజధాని వస్తుందని ముందే వీరికి ఎలా తెలుసని ప్రశ్నించారు.