బీఎస్పీ అధినేత్రి మాయావతి, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మహిళల బాధలు మోదీకి తెలియవన్నారు. తాను దళిత ద్రోహిగా మారినట్టు మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా కౌంటరిచ్చారు. భార్యను వదిలేసిన మోదీకి ఆడవాళ్ల బాధలు ఎలా తెలుస్తాయని వ్యక్తిగత విమర్శలు చేశారు.
మోదీ దొంగ బీసీ అని విమర్శించారు మయావతి. ఎన్నికల సభల్లోనే తాను పేదవాడినని చెప్పుకుంటున్నారని అన్నారు. మోదీ ప్రభావంతో తమ భర్తలు కూడా చెడిపోతారన్న భయం.. బీజేపీ నేతల భార్యలను వెంటాడుతోందని అన్నారు మాయావతి. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు బీజేపీ నేతలు.