రాజుకున్న అస్సాం ‘అగ్గి ఆగింది’, 6 నెలల బ్లో ఔట్ కథ ముగిసింది. ఆయిల్ ఇండియా ప్రకటన

| Edited By: Pardhasaradhi Peri

Nov 15, 2020 | 9:09 PM

అస్సాం లోని బాఘ్ జన్ లో గల చమురుబావిలో చెలరేగిన మంటలు చల్లారాయి. సుమారు 6 నెలల పాటు ఈ గ్యాస్ వెల్ లో మంటలు మండుతూనే వచ్చాయి..

రాజుకున్న అస్సాం అగ్గి ఆగింది, 6 నెలల బ్లో ఔట్ కథ ముగిసింది. ఆయిల్ ఇండియా ప్రకటన
Follow us on

అస్సాం లోని బాఘ్ జన్ లో గల చమురుబావిలో చెలరేగిన మంటలు చల్లారాయి. సుమారు 6 నెలల పాటు ఈ గ్యాస్ వెల్ లో మంటలు మండుతూనే వచ్చాయి. నల్లని పొగలు విరజిమ్ముతూనే వచ్చాయి. చివరకు ఆదివారం ఈ మంటలను పూర్తిగా ఆర్పినట్టు ఆయిల్ ఇండియా ప్రకటించింది. బ్రైమ్ సొల్యూషన్ అనే ప్రత్యేక లిక్విడ్ ని ఉపయోగించినట్టు ఈ సంస్ట వెల్లడించింది. ప్రస్తుతం ఈ చమురుబావిలో ఎలాంటి మంటలు లేవని, కానీ 24 గంటలపాటు పరిస్థితిని పరిశీలిస్తామని ఆయిల్ ఇండియా పేర్కొంది. ఈ మంటలను ఆర్పేందుకు ప్రభుత్వం విదేశీ నిపుణులను కూడా రప్పించింది. కానీ ఫలితం లేకపోయింది. బ్లో ఔట్ కారణంగా చుట్టుపక్కల గల వందలాది కుటుంబాలను అధికారులు వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు.