యోగి ఆదిత్యనాథ్ సంచలన‌ నిర్ణయం!

| Edited By:

Jun 28, 2019 | 9:45 PM

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక‌ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీకి చెందిన నేతల బంధువులకు బీజేపీ తరపున టిక్కెట్లను కేటాయించమని తేల్చి చెప్పారు. రాబోయే ఉప ఎన్నికల్లో పార్టీని ఎలా సిద్ధం చేయాలనే అంశంపై బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశమైంది. పార్టీ కోసం నిజంగా శ్రమించే కార్యకర్తలకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించామని, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల బంధువులకు ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ కేటాయించవద్దని సమావేశం నిర్ణయించునట్టు తెలుస్తోంది. […]

యోగి ఆదిత్యనాథ్ సంచలన‌ నిర్ణయం!
Follow us on

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక‌ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీకి చెందిన నేతల బంధువులకు బీజేపీ తరపున టిక్కెట్లను కేటాయించమని తేల్చి చెప్పారు. రాబోయే ఉప ఎన్నికల్లో పార్టీని ఎలా సిద్ధం చేయాలనే అంశంపై బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశమైంది. పార్టీ కోసం నిజంగా శ్రమించే కార్యకర్తలకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించామని, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల బంధువులకు ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్ కేటాయించవద్దని సమావేశం నిర్ణయించునట్టు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బంధుప్రీతిని ప్రోత్సహించమని ఆ నేత తెలిపారు. చాలా మంది పార్లమెంట్ సభ్యులు ఈ ఉప ఎన్నికల్లో తమ బంధు వర్గానికి టిక్కెట్లు కేటాయించమని రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తేవడంతో సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి.