టీడీపీ కేవలం అక్కడే కనిపిస్తుంది.. బీజేపీ నేత రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Jul 14, 2019 | 2:15 PM

టీడీపీ అనే పార్టీ భయంకరమైన అవినీతితో ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. నేరాలకు నిలయంగా మారిపోయిన టీడీపీ కేవలం తానా సభలలో మాత్రమే మిగులుతుందని ధ్వజమెత్తారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికార పార్టీ దిశగా 2024 నాటికి బీజేపీ ఎదగాలని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఏపీలోని అత్యధిక ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించేట్లు […]

టీడీపీ కేవలం అక్కడే  కనిపిస్తుంది.. బీజేపీ నేత రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు
Follow us on

టీడీపీ అనే పార్టీ భయంకరమైన అవినీతితో ఏపీలో టీడీపీ భూస్థాపితం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. నేరాలకు నిలయంగా మారిపోయిన టీడీపీ కేవలం తానా సభలలో మాత్రమే మిగులుతుందని ధ్వజమెత్తారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికార పార్టీ దిశగా 2024 నాటికి బీజేపీ ఎదగాలని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఏపీలోని అత్యధిక ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించేట్లు చూడాలని రామ్ మాధవ్ విఙ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా దారుణంగా తయారైందన్నారు రామ్ మాధవ్. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సెటైర్ వేశారు. సభ్యత్వ నమోదులో భాగంగా ఐదు వారాల వ్యవధిలో రాష్ట్ర నాయకత్వం కొత్త సభ్యుల చేరికను చేపట్టాలని, ఒక్కో కార్యకర్త స్వయంగా 25 మంది కొత్త సభ్యులకు సభ్యత్వం ఇప్పించాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలోకి వచ్చేవారికి సూచలను చేశారు. తమ పార్టీ ఏ కూలానికి, వర్గానికి, మతానికి కొమ్ముకాయదని చెప్పారు రామ్ మాధవ్.