బీహార్, హిసువా నియోజకవర్గం….. ఫుల్మా గ్రామంలో ఓ పోలింగ్ కేంద్రంలోని బీజేపీ పోలింగ్ ఏజెంట్ కృష్ణకుమార్ సింగ్ గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ససారంలో 65 ఏళ్ళ ఓటరు పోలింగ్ కేంద్రం వద్దకు వస్తూ.. అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా-ఉదయం 9 గంటలకల్లా ఈ మొదటి దశ ఎన్నికల్లో 6.3 శాతం పోలింగ్ నమోదైంది.