Inter Marks: ‘ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనీ..’ కత్తితో ఒకళ్లనొకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు

ఇంటర్‌ ఫలితాల్లో తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని కూమార్తెను ప్రశ్నించడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణికావేశంలో తల్లి తన కడుపున పుట్టిన కుమార్తెను కత్తితో పొడిచింది. దీంతో కుమార్తె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన బెంగళూరులో సోమవారం (ఏప్రిల్‌ 29) రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Inter Marks: 'ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనీ..' కత్తితో ఒకళ్లనొకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు
Mother Stabs Daughter
Follow us

|

Updated on: Apr 30, 2024 | 5:46 PM

బెంగళూరు, ఏప్రిల్ 30: ఇంటర్‌ ఫలితాల్లో తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని కూమార్తెను ప్రశ్నించడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణికావేశంలో తల్లి తన కడుపున పుట్టిన కుమార్తెను కత్తితో పొడిచింది. దీంతో కుమార్తె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన బెంగళూరులో సోమవారం (ఏప్రిల్‌ 29) రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బెంగళూరులోని బనశంకరిలోని శాస్త్రి నగర్‌లో నివాసం ఉంటోన్న పద్మజ (60) భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు కుమార్తె సాహితి (19) ఉంది. సాహితీ ఈ ఏడాది ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయగా.. ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో సాహితీకి తక్కువ మార్కులు వచ్చాయి. ఇదే విషయమై తల్లి పద్మజ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తక్కువ మార్కులు వచ్చాయేమని సాహితీని ప్రశ్నించింది. చదువును నిర్లక్ష్యం చేస్తుందని సాహితీపై పద్మజ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తల్లికూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహంతో పద్మజ కత్తితో సాహితీపై దాడి చేసి, పొడిచింది. సాహితీ కూడా అదే కత్తిని తీసి తల్లి పద్మజను పొడిచింది. ఇరుగుపొరుగు గమనించి వారిని ఆస్పత్రికి తరలించగా.. సాహితీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. పద్మజ తీవ్ర గాయాలతో ఇంటెన్సివ్‌ కేర్‌లో చికిత్స పొందుతోంది. దీనిపై బనశంకరి పోలీసులు పోలీసులు కేసునమోదు చేసుకుని, పద్మజ కోలుకున్న తర్వాత విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందేమోనన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాధమిక దర్యాప్తు ప్రకారం.. తల్లికూతుళ్లు వాగ్వాదం అనంతరం కత్తితో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సాహితీ చనిపోగా, ఆమె తల్లి పద్మజ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తదుపరి విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ