ఎండాకాలం లో ఎండు ద్రాక్ష  తింటే షాకింగ్ బెనిఫిట్స్

Phani.ch

20 May 2024

ఎండాకాలం వస్తుందంటేనే మనకి బాగా ఎదుర్కునే సమస్య డీహైడ్రేషన్ ఒకటి. శరీరం లో నీరు ఎక్కువ కోల్పోవడం ఈ సమస్య ఎదురవుతుంది.

శరీరం డీహైడ్రేషన్ అయితే అలసట, తలనొప్పి, మైకము వంటి లక్షణాలు కనిపిస్తాయి.  అయితే ఎండుద్రాక్ష ఒక అద్భుతమైన పరిష్కారం.

ఎండుద్రాక్షలు పోషకాల సమృద్ధి కలిగిన డ్రై ఫ్రూట్స్, వేసవిలో శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడతాయి. 

ఎండుద్రాక్ష లో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది.

దీని లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు. ఇందులో బోలెఉ పోషకాలు ఉంటాయి.

ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది.  ఇది బీపీ లెవల్స్‌ను అదుపులో ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. 

 వేసవికాలంలో తరచుగా జీర్ణక్రియ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీని నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు  ఈ ఎండు ద్రాక్షలను తీసుకోవాల్సి ఉంటుంది. 

శారీరం బలహీనంగా ఉన్నప్పుడు ఈ ద్రాక్షను తీసుకోవడం మంచిది. అలెర్జీ, వేడి శరీరం వంటి వ్యక్తులు తీసుకోవడం మంచిది కాదు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.