AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

విమానంలో ప్రయాణిస్తోన్న ఓ గర్బిణి మార్గమధ్యలోనే ప్రసవించింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని ఇండిగో ఎయిర్ లైన్సు అధికారులు వెల్లడించారు.

విమానంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
Balaraju Goud
|

Updated on: Oct 08, 2020 | 12:36 PM

Share

విమానంలో ప్రయాణిస్తోన్న ఓ గర్బిణి మార్గమధ్యలోనే ప్రసవించింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని ఇండిగో ఎయిర్ లైన్సు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి బెంగళూరుకు బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇండిగో విమానం బయలుదేరింది. అందులో ప్రయాణిస్తోన్న ఓ గర్బిణికీ అకస్మాత్తుగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. మహిళ నెలలు నిండకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు.

విమానం బయలుదేరిన కొద్దిసేపటికే మహిళకు పురిటి నొప్పులు రావడంతో సిబ్బంది నిమిషాల్లోనే ఏర్పాట్లు చేశారు. అదే విమానంలో ఓ వైద్యురాలు ఉండటంతో కలిసొచ్చింది. విమానంలో ప్రయాణిస్తోన్న డాక్టర్ శైలజ వల్లభాని, క్యాబిన్ క్యూ సిబ్బంది సాయంతో పురుడుపోసింది. ఈ సమయంలో విమాన ప్రయాణానికి కూడా ఎటువంటి ఆటంకం ఏర్పడలేదన్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

విమానం బుధవారం రాత్రి 7.30 గంటలకు బెంగళూరుకు చేరిన వెంటనే తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించినట్టు అధి్కారులు పేర్కొన్నారు. రాత్రి 6.10 గంటలకు మహిళ ప్రసవించిందని ఇండిగో విమాన కెప్టెన్ క్రిష్టోఫర్ ట్వీట్ చేశారు. తల్లీ బిడ్డలకు తమ సిబ్బంది ప్రథమ చికిత్స చేశారని తెలిపారు. అంతేకాదు, తమ విమానంలో ఓ తల్లి బిడ్డకు జన్మనివ్వడం తమకు గర్వకారణమని కెప్టెన్ సంతోషం వ్యక్తం చేశారు.