సీపీఐ కార్యాలయంపై దాడి, నిందితుల అరెస్ట్

|

Sep 14, 2020 | 3:12 PM

హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌పై గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి రాళ్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

సీపీఐ కార్యాలయంపై దాడి, నిందితుల అరెస్ట్
Follow us on

హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌పై గుర్తుతెలియని దుండగులు ఆదివారం రాత్రి రాళ్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, దాడికి పాల్పడిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దాడిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వారిని అడ్డుకోడానికి ప్రయత్నించిన సురేందర్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. సీసీ ఫుటేజీ ద్వారా నిందితులను  పాతబస్తిలోని ఛత్రినాక వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ రోజు ఉదయం నారాయణగూడ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి, నిందితులను విచారిస్తున్నారు.

Also Read :

విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్

ఏపీలో కుండపోత వర్షం, ఈ జిల్లాలకు అలర్ట్