
తైవాన్కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అసూస్ తాజాగా భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. అసూస్ 8 జెడ్ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్లో 5.9 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+డిస్ప్లేను అందించారు. ఇక అసూస్ 8 జెడ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 చిప్సెట్తో పనిచేస్తుంది.

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ స్మార్ట్ఫోన్ను డస్ట్, వాటర్ ప్రూఫ్గా తయారు చేశారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ 5జీ నెట్వర్క్కి సపోర్ట్ చేస్తుంది.

మార్చి 7 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 42,999కి అందుబాటులో ఉండనుంది. ఇక ఈ ఫోన్లో ట్రిపుల్ మైక్రోఫోన్స్ను అంచారు.