మా ఢిల్లీ రాష్ట్రం మాకిచ్చేయండి – కేజ్రీవాల్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. భార‌తీయ ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ర‌క్షించ‌డ‌మే తమ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ అధ్యక్షుడు అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ కూడా చేశారు. కేంద్ర స‌ర్కారు ఏర్పాటులో ఢిల్లీ ప‌రిధిలోని ఏడు సీట్లు కీల‌కం కానున్నాయ‌ని కేజ్రీవాల్ తెలిపారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, ఆరోగ్యం, కాలుష్యం, అవినీతి లాంటి అంశాలు ఢిల్లీని పీడిస్తున్నాయ‌ని.. […]

మా ఢిల్లీ రాష్ట్రం మాకిచ్చేయండి - కేజ్రీవాల్

Edited By:

Updated on: Apr 25, 2019 | 6:39 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. భార‌తీయ ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ర‌క్షించ‌డ‌మే తమ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ అధ్యక్షుడు అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ కూడా చేశారు. కేంద్ర స‌ర్కారు ఏర్పాటులో ఢిల్లీ ప‌రిధిలోని ఏడు సీట్లు కీల‌కం కానున్నాయ‌ని కేజ్రీవాల్ తెలిపారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, ఆరోగ్యం, కాలుష్యం, అవినీతి లాంటి అంశాలు ఢిల్లీని పీడిస్తున్నాయ‌ని.. రాష్ట్రం చేతులను కేంద్రం కట్టడి చేయడం వల్లే ఈ ప్రమాదం తలెత్తుతోందని కేజ్రీవాల్ చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పాల్గొన్నారు.