20 మంది అమరవీరుల స్మృతికి చిహ్నంగా లడాఖ్ లో మెమోరియల్

గత జూన్ 15 న గాల్వన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో అమరులైన 20 మంది జవాన్ల స్మృత్యర్థం లడాఖ్ లో సైన్యం స్మారకాన్ని (మెమోరియల్) నిర్మించింది. 'గ్యాలంట్స్ ఆఫ్ గాల్వన్..

20 మంది అమరవీరుల స్మృతికి చిహ్నంగా లడాఖ్ లో మెమోరియల్

Edited By:

Updated on: Oct 03, 2020 | 7:05 PM

గత జూన్ 15 న గాల్వన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో అమరులైన 20 మంది జవాన్ల స్మృత్యర్థం లడాఖ్ లో సైన్యం స్మారకాన్ని (మెమోరియల్) నిర్మించింది. ‘గ్యాలంట్స్ ఆఫ్ గాల్వన్’ పేరిట ఈ స్మారకాన్ని నిర్మించినట్టు ఆర్మీ తెలిపింది. ఈ లోయలో చైనా దళాలను ధైర్య సాహసాలతో ఎదిరించి వారిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించిన ఈ జవాన్లను తాము సదా స్మరించుకుంటామని సైనికాధికారులు తెలిపారు. కాగా నాటి ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు గాయపడిందీ లేదా  మరణించిందీ ఇప్పటివరకు స్పష్టంగా తెలియలేదు. అయితే 35 మంది మృతి చెందినట్టు అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్టు పేర్కొంది.