సీఎం జగన్ కీలక నిర్ణయం.. మంత్రులు గ్రామాల్లోనే బస చేయాలి

| Edited By:

May 11, 2020 | 1:06 PM

వివిధ ట్యాంకుల్లో ఉన్న స్టైరిన్ రసాయనాన్ని వెనక్కి పంపాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభావిత గ్రామాల్లో స్టైరిన్ అవశేషాలు ఏ మాత్రం లేకుండా శాలిటైజ్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామస్తులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు మంత్రులు ఆయా గ్రామాల్లో బస చేయాలని..

సీఎం జగన్ కీలక నిర్ణయం.. మంత్రులు గ్రామాల్లోనే బస చేయాలి
Follow us on

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో స్టైరిన్ రసాయనాన్ని ఉంచడానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు. వివిధ ట్యాంకుల్లో ఉన్న స్టైరిన్ రసాయనాన్ని వెనక్కి పంపాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభావిత గ్రామాల్లో స్టైరిన్ అవశేషాలు ఏ మాత్రం లేకుండా శాలిటైజ్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామస్తులకు ధైర్యాన్ని ఇచ్చేందుకు మంత్రులు ఆయా గ్రామాల్లో బస చేయాలని సూచించారు సీఎం జగన్.

కాగా ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రభావం ప్రాంతాల్లోని ఐదు గ్రామాలకు ఈ సాయంత్రం తర్వాత వెళ్లొచ్చని ప్రజలకు సూచించారు మంత్రులు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పెద్ద ఎత్తున నడుస్తోందని.. పిల్లలు, వృద్ధులు కాకుండా మిగిలిన వారు తొలుత వెళ్లాలని, జీవీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇచ్చే శానిటైజర్స్‌తో ఇళ్లను శుభ్రం చేయాలని సూచించారు మంత్రులు. కాగా ఈ రాత్రికి తాము కూడా గ్రామాల్లోనే బస చేస్తామని తెలిపారు.

అలాగే ఎల్జీ గ్యాస్ లీక్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు సహాయం అందించారు ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి, ధర్మాన కష్ణదాస్ కోటి రూపాయల చెక్‌లను అందజేశారు. మృతి చెందిన కుటుంబ సభ్యులు కూడా ఇంకా కేజీహెచ్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అక్కడే వారికి చెక్కులను అందజేశారు మంత్రులు.

Read More: దిల్‌రాజు పెళ్లి ఫొటోలు.. మాతృదినోత్సవం రోజు కొత్త జీవితం