ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్కు రూ.50 కోట్లు రిలీజ్ చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో సంస్థ వ్యూహాలు, మార్కెట్ రీసెర్చి, కన్సల్టెంట్లు, ఇంజినీరింగ్ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులు రిలీజ్ చేసినట్టు పరిశ్రమల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కడపలో హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం వివిధ కంపెనీల ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది.