జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. కోవిడ్ ఆసుపత్రులకు రాయితీలు..

కరోనా నివారణకు జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. కోవిడ్ ఆసుపత్రులకు రాయితీలు..

Updated on: Jul 21, 2020 | 1:36 AM

Coronavirus Prevention Measures: కరోనా నివారణకు జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ ఆసుపత్రుల్లోని మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు అందించాలని సూచించారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయిలో ఉన్న కోవిడ్ ఆసుపత్రుల సంఖ్యను 5 నుంచి 10కి పెంచాలని నిర్ణయించారు. వైద్యులపై పనిభారం తగ్గించడమే కాకుండా జిల్లాల్లోని 84 కోవిడ్ ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

అలాగే కరోనా వస్తే ఏం చేయాలి.? ఎవరిని సంప్రదించాలి.? అనే అంశాలపై ప్రజలకు, కరోనా అనుమానితులకు అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని.. ప్రతీ చోటా హోర్డింగ్స్ పెట్టాలని సీఎం సూచించారు. కరోనా ఎవరికైనా వస్తుందన్న ఆయన.. ఆందోళన పడవద్దని.. 85 శాతం మందికి ఇళ్లలోనే నయం అవుతోందని అన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలని సూచించారు. కాగా, దీర్ఘకాలిక రోగులకు, 60 ఏళ్లు దాటిన వారికి వైద్య సహాయంలో ఆలస్యం చేయొద్దని అన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకం తొందరగా చేపట్టాలని సీఎం జగన్ తెలిపారు.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా..

ఏపీలో కరోనా కల్లోలం.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..

Loading...
Unable to load recommendations.
Follow Us