AP CS Letter To Central: ఏపీ పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కొన్ని రోజులుగా సాగుతోన్న పలు నాటకీయ పరిణాల తర్వాత సోమవారం సుప్రీం కోర్టు ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటించింది.
ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కేంద్రానికి లేఖ రాశారు. కోవిడ్ వ్యాక్సినేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు తగిన సూచనలు చేయాలని లేఖ రాశారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్కు ఆదిత్యనాథ్ ఈ లేఖను అందజేశారు. మరి ఓవైపు ఎన్నికల నిర్వహణ, మరోవైపు వ్యాక్సినేషన్ కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.