అరటి పళ్లు అమ్ముతున్న బడి పంతులు..!

|

Jun 05, 2020 | 9:12 PM

ఏపీలో లాక్ డౌన్ లో జీతాలు ఇవ్వలేమని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. రోడ్డుపై అరటిపళ్లు అమ్ముతున్న ఉపాధ్యాయుడు

అరటి పళ్లు అమ్ముతున్న బడి పంతులు..!
Follow us on

బతుకలేక బడి పంతులు అనే పాత సామెతను మరోసారి రుజువు చేసింది కరోనా లాక్ డౌన్. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. వీటితో పాటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఆదాయం కోల్పోయిన ఓ ఉపాధ్యాయుడు రోడ్డుపై అరటిపళ్లు అమ్ముతున్న ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.
నెల్లూరు జిల్లాకు చెందిన ఒక యువకుడు 15 ఏళ్లుగా ఓ ప్రైవేట్ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ లో జీతాలు ఇవ్వలేమని ఆ స్కూల్ యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో అతని బతుకుచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. కుటుంబ పోషణ సాగాలంటే ఏదో పని చేసుకోవాలని భావించి రోడ్డునపడ్డాడు. వీధుల వెంబడి తిరుగుతూ తోపుడుబండితో అరటిపండ్లు అమ్ముతూ తన బతుకుబండిని లాగుతున్నాడు ఈ టీచర్. మరోవైపు లాక్ డౌన్ పుణ్యామని ఉన్న ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారుతున్నారు. వ్యాపార సంస్థలు సైతం గిరాకీలు లేక వ్యయాన్ని తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. కడుపు నిండ తిండి తినలేక బ్రతుకు జీవుడా అంటూ కాలం వెల్లదీస్తున్నారు.