ఇకపై జగన్‌వి ఆ రెండు ఫొటోలే వాడాలి..!

|

Nov 13, 2019 | 8:39 AM

రాష్ట్ర సంక్షేమ పథకాల్లో గానీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లోనూ ముఖ్యమంత్రి ఫోటోలను తప్పకుండా ఉపయోగిస్తారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు సీఎం కార్యాలయం ముఖ్యమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వం తరపున చేసిన కార్యక్రమం ఏదైనా.. రాసిన వార్త ఏదైనా.. లేదా ఏ ప్రకటన వచ్చినా.. సీఎంకు సంబంధించి ఈ రెండు ఫోటోలు మాత్రమే వాడాలంటూ సీఎం కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ […]

ఇకపై జగన్‌వి ఆ రెండు ఫొటోలే వాడాలి..!
Follow us on

రాష్ట్ర సంక్షేమ పథకాల్లో గానీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లోనూ ముఖ్యమంత్రి ఫోటోలను తప్పకుండా ఉపయోగిస్తారు. ఇక వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు సీఎం కార్యాలయం ముఖ్యమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వం తరపున చేసిన కార్యక్రమం ఏదైనా.. రాసిన వార్త ఏదైనా.. లేదా ఏ ప్రకటన వచ్చినా.. సీఎంకు సంబంధించి ఈ రెండు ఫోటోలు మాత్రమే వాడాలంటూ సీఎం కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

గతంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ ప్రభుత్వ అధికార మాసపత్రిక కవర్ పేజ్‌పై జగన్ ఫోటోను బ్లాక్ అండ్ వైట్‌లో ముద్రించడం పెద్ద సంచలనం అయింది. అంతేకాకుండా ఆ పత్రిక ప్రచురణను కూడా ఆగిపోయింది. ఇక ఆ తర్వాత ప్రభుత్వం తరపున జరిగే కార్యక్రమాలన్నింటికీ కూడా జగన్ ఫోటోలతో కూడిన బ్యానర్లను రూపొందించేవారు. అయితే ఆ బ్యానర్లలలో పలు రకాల ఫోటోలను వాడుతుండటంతో.. సీఎం జగన్ అన్ని ప్రభుత్వ శాఖలకు క్లారిటీ ఇచ్చారు.