జెరూసలెంలో జగన్ తో సరదాగా.. మేమెంతో హ్యాపీగా..

జెరూసలేం పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ వెళ్లిన ఏపీ సిఎం జగన్ ని ‘ ఇజ్రాయెల్ తెలంగాణ ఎన్ ఆర్ ఐ అసోసియేషన్ ‘ కు చెందిన ఆర్మూర్ వాసులు కలుసుకుని తమ అభిమానాన్ని చాటారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి.. తాను తన కొడుకుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతో ఆయన పేరే పెట్టుకున్నట్టు తెలిపారు. ఉపాధికోసం తాము ఇజ్రాయెల్ వచ్చినా.. ప్రతియేటా వైఎస్ రాజశేఖర రెడ్డి […]

జెరూసలెంలో జగన్ తో సరదాగా.. మేమెంతో హ్యాపీగా..

Updated on: Aug 04, 2019 | 1:54 PM

జెరూసలేం పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ వెళ్లిన ఏపీ సిఎం జగన్ ని ‘ ఇజ్రాయెల్ తెలంగాణ ఎన్ ఆర్ ఐ అసోసియేషన్ ‘ కు చెందిన ఆర్మూర్ వాసులు కలుసుకుని తమ అభిమానాన్ని చాటారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి.. తాను తన కొడుకుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతో ఆయన పేరే పెట్టుకున్నట్టు తెలిపారు. ఉపాధికోసం తాము ఇజ్రాయెల్ వచ్చినా.. ప్రతియేటా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. వీరి అభిమానానికి జగన్ ముగ్ధులయ్యారు. కాగా- ఆయన ఇజ్రాయెల్ లో ఆధునిక వ్యవసాయ దిగుబడులు, సాంకేతిక పరిజ్ఞానంపై నిపుణులతో చర్చిస్తున్నారు. ప్రపంచంలో వ్యవసాయరంగంలో ఇజ్రాయెల్ సాధించిన ప్రగతి చాలా పాపులర్ అయింది. తక్కువ వర్షపాతంతో ఎక్కువ పంటలు పండించగల సత్తా సాధించింది. అక్కడి కొన్ని వ్యవసాయ క్షేత్రాలను కూడా జగన్ సందర్శించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us