శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: బన్నీ

| Edited By:

Aug 18, 2020 | 6:22 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి టాలీవుడ్‌లోనే కాకుండా మాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉంది. ఇటీవలే ఆయన చేసిన అల వైకుంఠపురం సినిమా ఘన విజయాన్ని సాధించి ఎన్నో రికార్డులను తిరగరాసిన విషయం..

శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: బన్నీ
Follow us on

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి టాలీవుడ్‌లోనే కాకుండా మాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉంది. ఇటీవలే ఆయన చేసిన అల వైకుంఠపురం సినిమా ఘన విజయాన్ని సాధించి ఎన్నో రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా బన్నీ సాంగ్స్‌కి టిక్ టాక్ వీడియోలు చేశాడంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్‌కి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటూ అల్లు అర్జున్ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలని తరుచూ ఇన్‌స్టాలో షేర్ చేస్తూంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఫొటోవర్స్ సంఖ్య 8 మిలియన్లకి చేరింది. అతి తక్కువ కాలంలో ఈ ఘనత సాధించిన బన్నీ తన అభిమానులకి థ్యాంక్స్ తెలిపాడు. నేను శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని రాసి ఉన్న ఓ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read:

రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు