మానవ మనుగడకు మొక్కలు నాటండి… అభిమానులకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన ఐశ్వర్య రాజేష్

|

Nov 17, 2020 | 4:18 PM

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మాదాపూర్‌ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.

మానవ మనుగడకు మొక్కలు నాటండి... అభిమానులకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన ఐశ్వర్య రాజేష్
Follow us on

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి మాదాపూర్‌ లో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.

ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యమని రోజురోజుకు పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోతుందని కాబట్టి అందరం బాధ్యతగా మొక్కలు నాటి మనం పీల్చుకునే ఆక్సిజన్‌ను మనమే పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చాలెంజ్ అదేవిధంగా కొనసాగాలని కావున తన అభిమానులను స్నేహితులను మొక్కలు నాటి వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని దాన్ని నేను షేర్ చేస్తానని పిలుపునివ్వడం జరిగింది.