మన వ్యాక్సిన్ త్వరలోనే వచ్చేస్తోంది, ఆమోదం లభించడమే తరువాయి, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్

బ్రిటన్ తమ దేశ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటు గురించి ఇలా ప్రకటించిందో, లేదో భారత వైద్య వర్గాలు కూడా మన దేశీయ వ్యాక్సిన్  గురించి వెల్లడించాయి. దేశంలో ఇప్పుడు రెండు, మూడు కోవిడ్ 19 వ్యాక్సిన్లు తుది ట్రయల్ దశలో..

మన వ్యాక్సిన్ త్వరలోనే వచ్చేస్తోంది, ఆమోదం లభించడమే తరువాయి, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్

Edited By:

Updated on: Dec 03, 2020 | 3:39 PM

బ్రిటన్ తమ దేశ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటు గురించి ఇలా ప్రకటించిందో, లేదో భారత వైద్య వర్గాలు కూడా మన దేశీయ వ్యాక్సిన్  గురించి వెల్లడించాయి. దేశంలో ఇప్పుడు రెండు, మూడు కోవిడ్ 19 వ్యాక్సిన్లు తుది ట్రయల్ దశలో ఉన్నాయని, ఈ నెలాఖరుకు లేదా జనవరి ఆరంభానికి దీని అత్యవసర వినియోగానికి భారత రెగ్యులేటరీ సంస్థల నుంచి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఈ సంస్థల నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే రానున్న రెండు, మూడు నెలల్లో ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈ టీకామందులు సురక్షితమైనవని డేటా అందిందన్నారు. 70 వేల నుంచి 80 వేల మంది వలంటీర్లకు వీటిని ఇచ్చామని, ఎవరికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్టు తెలియలేదన్నారు. షార్ట్ టర్మ్ వ్యాక్సిన్ సేఫ్ అని తేలింది అని డా. గులేరియా పేర్కొన్నారు.

ఓ వ్యాక్సిన్ ట్రయల్ దశలో చెన్నైలో ఒక వ్యక్తికి రియాక్షన్ కలిగినట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ ఆయన, ఆ కేసు బహుశా వ్యాక్సిన్ కి సంబందించినది  కాకపోయి ఉండవచ్చు అన్నారు. అనేకమందికి టీకా మందు ఇచ్చినప్పుడు వారిలో కొందరికి ఇతర వ్యాధులేవైనా ఉండవచ్చునన్నారు. అంతే తప్ప ఈ టీకా మందుకు దానికి సంబంధం లేదన్నారు. దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం హర్షణీయమని గులేరియా పేర్కొన్నారు. మరో 3 నెలలు మనం మంచి బిహేవియర్ పాటిస్తే ఇంకా తగ్గుతాయని ఆయన చెప్పారు.  ఈ సందర్భంగా మాస్కుల ధారణ వంటి వాటిని ప్రస్తావించారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us