షాకింగ్..మరో ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా..!

|

Jun 22, 2020 | 11:12 PM

పాకిస్థాన్‌లో కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోంది. తాజాగా మరో ముగ్గురు క్రికెటర్లకు క‌రోనా సోకింది. పాక్‌ క్రికెటర్లు షాదాబ్‌, హరీష్‌ రవూఫ్‌, హైదర్‌ అలీ ఈ వైర‌స్ బారిన‌ పడినట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది.

షాకింగ్..మరో ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా..!
Follow us on

పాకిస్థాన్‌లో కరోనా వైరస్ వీర‌విహారం చేస్తోంది. తాజాగా మరో ముగ్గురు క్రికెటర్లకు క‌రోనా సోకింది. పాక్‌ క్రికెటర్లు షాదాబ్‌, హరీష్‌ రవూఫ్‌, హైదర్‌ అలీ ఈ వైర‌స్ బారిన‌ పడినట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లే ముందు రావల్పిండిలో ఆదివారం కోవిడ్-19 నిర్ధారణ టెస్టులు నిర్వహించే వరకు వారిలో కరోనా సింట‌మ్స్ కనిపించలేదని సమాచారం. దీంతో ఈ ముగ్గురినీ వెంట‌నే హెమ్ క్వారంటైన్ కు ఆదేశించిన‌ట్టు పీసీబీ తెలిపింది. ఇమాద్‌ వసీం, ఎస్మాన్‌ షిన్వరికి కూడా టెస్టులు చేయగా వారికి నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్టు వివ‌రించింది. ఇంకా కొందరు ప్లేయ‌ర్స్, అధికారులకు కరాచీ, లాహోర్‌,పెషావర్‌లలో ఈ రోజు టెస్టులు చేయ‌గా.. వారి రిపోర్టులు రేపు వచ్చే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది క‌రోనా‌ బారిన పడిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 1.82లక్షలకు పైగా కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీరిలో 3606 మంది చ‌నిపోయారు.